కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దామోదర్ రెడ్డి కి 14వ వార్డులో బిగ్ షాక్


కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు దాసరి విక్రమ్ కుమార్ మరియు దోన్వాన్ అఖిల్ నాయక్  కాంగ్రెస్ పార్టీకి రాజీనామా  

జగదీష్ రెడ్డి  సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిక

సూర్యాపేట: పట్టణంలోని 14వ వార్డులోనున్న స్నేహ నగర్, వెంకటేశ్వర కాలనీ లకు చెందిన కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు దాసరి విక్రమ్ కుమార్ మరియు దోన్వాన్ అఖిల్ నాయక్  కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో జగదీష్ రెడ్డి  సమక్షంలో  గుండపునేని కిరణ్ ఆధ్వర్యంలో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా పనిచేసిన ఈ యువ నాయకులు,ఈరోజు సూర్యాపేట అభివృద్ధిని చూసి, సూర్యాపేటకు జగదీశ్ రెడ్డి నాయకత్వమే కావాలని కోరుకొని ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యారు. దాసరి విక్రమ్ మాట్లాడుతూ సూర్యాపేట అభివృద్ధి ప్రదాత ఖచ్చితంగా జగదీష్ రెడ్డి మాత్రమేనని, మరోసారి ఆయన గెలుపు ఖాయమన్నారు. 800 మంది యువకులతో కలసి ఓటర్లు ఆలోచించి సూర్యాపేట సమగ్రాభిద్దికి ఓటువేయాలని సూచిస్తూ ప్రచారం చేశారు.